Home/Movies/Anasuya Responds to Sanatana Dharma Controversy, Says Her Remarks Were Misrepresented

సనాతన ధర్మం వివాదంపై అనసూయ క్లారిటీ...

Aug 14, 2026
Updated August 29, 2026
3 min read
Anasuya Responds to Sanatana Dharma Controversy, Says Her Remarks Were Misrepresented - Movies News | Krihaa
Size:
Key Highlights
  • 1సనాతన ధర్మంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వచ్చిన విమర్శలకు అనసూయ స్పందించారు.
  • 2‘జై శ్రీరామ్’ అంటూ కొందరి విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆమె అన్నారు.
  • 3తాను సనాతన ధర్మాన్ని విశ్వసిస్తానని, హనుమాన్ భక్తురాలినని అనసూయ స్పష్టం చేశారు.
Fact-Checked by Krihaa Editorial

టాలీవుడ్ నటి అనసూయ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందూ సనాతన ధర్మంపై ఆమె చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ‘జై శ్రీరామ్’ అంటూ కొందరు వ్యక్తులు చేస్తున్న చర్యలపై ఆమె చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని తాజాగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని అవమానించారంటూ తనపై వస్తున్న విమర్శలకు ఆమె వివరణ ఇచ్చారు.

తాను కూడా సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తినని, హనుమాన్ భక్తురాలినని అనసూయ స్పష్టం చేశారు. అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండటం తన స్వభావం కాదన్నారు. తాను మాట్లాడిన సందర్భాన్ని పూర్తిగా పక్కన పెట్టి కొన్ని క్లిప్పులు, వ్యాఖ్యలను మాత్రమే ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉన్నవారు ఎడిట్ చేసిన క్లిప్పులు, సందర్భం లేని ప్రకటనల వలలో పడవద్దని కోరారు. గతంలో వైరల్ అయిన ఓ వీడియోలో ‘జై శ్రీరామ్’ అనే నినాదాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని అనసూయ వ్యాఖ్యానించినట్లు ప్రచారం కావడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

Krihaa News Logo

Read Faster on Krihaa News App

Instant breaking news alerts, offline reading & Tollywood updates in Telugu & English.

GET IT ON
Google Play
Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

Published by

Krihaa News — Hyderabad, Telangana

Krihaa News is committed to accurate, independent reporting. Read our editorial guidelines and corrections policy.