తేలప్రోలు వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా.. 12 మందికి తీవ్ర గాయాలు
- 1కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలం తేలప్రోలు సమీపంలో జాతీయ రహదారి-16పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
- 2చెన్నై నుంచి విశాఖపట్నం వైపు 26 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న వైబీఎం ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డుమధ్యలో ఉన్న డివైడర్పై బోల్తా పడింది.
- 3ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వెనుక నుంచి వస్తున్న ఓ లారీ బస్సును తప్పించుకునే ప్రయత్నంలో ఢీకొనడంతో లారీ డ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలం తేలప్రోలు సమీపంలో జాతీయ రహదారి-16పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి విశాఖపట్నం వైపు 26 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న వైబీఎం ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డుమధ్యలో ఉన్న డివైడర్పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వెనుక నుంచి వస్తున్న ఓ లారీ బస్సును తప్పించుకునే ప్రయత్నంలో ఢీకొనడంతో లారీ డ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ అంబులెన్సుల ద్వారా చిన్న అవుటపల్లిలోని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర, ఆత్కూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.
Comments (0)
Join the conversation
Sign in to post comments, like, and reply
సంబంధిత కథనాలు — జనరల్
మోదీ సప్తధార: వికసిత్ భారత్ కోసం 7 కీలక సంస్కరణలు
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ సప్తధార ప్రణాళికను ప్రకటించారు. తయారీ, వ్యవసాయం, టెక్నాలజీ, రక్షణ, హరిత వృద్ధి, సాఫ్ట్ పవర్పై దృష్టి.

‘గుప్త నిధుల’ పేరుతో 11 మందిని మోసం.. రూ.1 కోటి స్వాహా
ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి 11 మందిని ఓ ముఠా మోసం చేసిన ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది. దాదాపు రూ.1 కోటి వసూలు చేసిన నిందితులు, గుంతల్లో బొగ్గు, నకిలీ బంగారు నాణేలు పెట్టి అవి బంగారంగా మారతాయని బాధితులను నమ్మించినట్లు పోలీసులు తెలిపారు.

పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రత భూకంపం.. 132 మంది మృతి
పశ్చిమ కొలంబియాలో సంభవించిన 7.4 తీవ్రత భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో కనీసం 132 మంది మృతి చెందగా, మరో 570 మందికి పైగా గాయపడ్డారు. 1,500కుపైగా ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రచురణ
క్రిహా న్యూస్ — హైదరాబాద్, తెలంగాణ
క్రిహా న్యూస్ ఖచ్చితమైన, స్వతంత్ర వార్తా విశ్లేషణకు కట్టుబడి ఉంది. మా ఎడిటోరియల్ గైడ్లైన్స్ మరియు సవరణల విధానం చూడండి.




